200
ml చింతపండు పులుసు (60 గ్రాముల చింతపండు నుండి తీసినది)
1/2
liter నీళ్ళు
విధానం
మూకుడులో వేరుసేనగపప్పు , మెంతులు వేసి ఎర్రగా లో- ఫ్లేం మీదే వేపుకోవాలి.
వేరు శెనగపప్పు బాగా వేగాక ధనియాలు, జీలకర్ర, వేసి ఓ నిమిషం వేపుకోవాలి, ఆ తరువాత నువ్వులు వేసి చిటచిటలాడించాలి. ఆఖరున కొబ్బరి పొడి వేసి 30 సెకన్లు వేపి మెత్తని పొడి చేసుకోవాలి
అదే మూకుడులో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. (ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే గ్రేవీ కి చిక్కని రుచి) వేగిన ఉల్లిపాయల్ని మెత్తగా చేసుకున్నపొడి లో వేసుకోవాలి.
అదే మిక్సీ జార్లో పొడితో పాటు అల్లం వెల్లూలి ముద్దా, కారం, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు అన్నీ వేసి మెత్తని వెన్నలాంటి పేస్టు చేసుకోవాలి
ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకున్న నూనెలో గుడ్లకి గాట్లు పెట్టి గరిట బోర్లించి తిప్పుతూ హై ఫ్లేం మీద ఎర్రగా వేపి తీసుకోవాలి.
గుడ్లు వేగాక పక్కకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
నూనె పైకి తేలాక 1/2 లీటర్ నీళ్ళు పోసి హై- ఫ్లేం మీద మూత పెట్టి బాగా ఉడుకురానివ్వాలి.
గ్రేవీ ఉడుకుపట్టాక గుడ్లు వేసి మంట తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి, మధ్య మధ్య లో అడుగు నుండి కలుపుకోవాలి.