మినపప్పు సెనగపప్పు కందిపప్పుని కలిపి నీటితో బాగా కడిగి 3-4 గంటలు నానబెట్టుకోవాలి.
నాలుగు గంటలు నానబెట్టిన పప్పుని పూర్తిగా వడకట్టి జల్లెడలో వేసి రెండు నిమిషాలు వదిలేయండి
ఛాపర్లో సోంపు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లులి ఎండుమిర్చి నానబెట్టిన పప్పు వేసి నీరు వేయకుండా బరకాగా గ్రైండ్ చేసి తీసుకోండి. పప్పులోంచి ఒక పిడికెడు పప్పు పక్కనుంచుకోవాలి.
మరో జనాల్లో బరకగా రుబ్బుకున్న పప్పు ఉల్లి పుదీనా కొత్తిమీర ఉప్పు వేసి గట్టిగా పిండుతూ పిండి కలుపుకోండి. ఇంకా పక్కనుంచుకున్న నానిన పప్పుని కూడా వేసి కలుపుకోండి.
చేతులు తడి చేసుకుని పెద్ద నిమ్మకాయ సైజు ఉందని తడి చేత్తో తట్టి మరిగే వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా వదిలేయండి.
మూడు నాలుగు నిమిషాల తరువాత నెమ్మదిగా గరిటతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీదే ఎర్రగా వేగనివ్వాలి(మసాలా వడ వేగడానికి సమయం పడుతుంది ఓపికగా వేపుకోవాలి)
ఎర్రగా వేగిన వాడని ప్లేట్లోకి తీసుకోండి. ఈ మూడు పప్పుల మసాలా వడ వేడి మీద యమా క్రిస్పీగా ఉంటాయి, చల్లారాక క్రిస్పీగా ఉంటాయి.