నూనె వేడి చేసి మొదటి తాలింపు సామంతా మంచి సువాసనోచ్చెంత వరకు వేపుకోవాలి. మెంతులు వేగాక మాత్రమే మిగిలిన సామాను ఒక్కొటిగా వేసి వేపుకోండి. ఆఖరున జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకుని దిమ్పెసుకోండి
తాలింపు చల్లారాక అప్పుడు మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి
ఇప్పుడు అదే మూకుడు లో 2 tbsp నూనెవేడి చేసి దొండకాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుని మూత పెట్టి దొండకాయలు పూర్తిగా మగ్గించుకోండి. దింపే ముందు చింతపండు వేసి 30 సెకన్లు మగ్గనిచ్చి దింపి చల్లార్చుకోండి.
ఇప్పుడు మిక్సీ జార్ లో చల్లార్చుకున్న దొండకాయ ముక్కలు, మెత్తగా పొడి చేసుకున్న తాలింపు, ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా కాస్త బరకగా రుబ్బుకోండి.
ఇప్పుడు రెండో తాలిమ్పుకి నూనె వేడి చేసి ఆవాలు ముందు వేసి ఒక్కొటిగా మిగిలిన సామగ్రి అంతా వేపుకుని దింపేసి పచ్చడి లో కలుపుకోండి. అందులోనే కొత్తిమీర కాస్త ఎక్కువగా వేసి కలిపి సర్వ్ చేసుకోండి.