తిరువదిరాయ్ కలి

Prasadam | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 30 Mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం
  • 1/4 cup పెసరపప్పు
  • 1/4 cup కందిపప్పు
  • 1 cup పచ్చికొబ్బరి తురుము
  • 3 cups బెల్లం
  • 1 cup నెయ్యి
  • 1/2 tsp యాలకలు పొడి
  • 2 pinches జాజికాయ పొడి
  • 15 జీడిపప్పు
  • 15 కిస్మిస్
  • 5 cups నీళ్లు

విధానం

  1. కందిపప్పు పెసరపప్పు వేసి మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
  2. వేపుకున్న పప్పు బియ్యం కలిపి మిక్సీలో వేసి గోధుమ రవ్వ అంత సన్నని రవ్వగా గ్రైండ్ చేసుకోండి.
  3. కుక్కర్లో 2 tbsp నెయ్యి కరిగించి అందులో రవ్వ వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
  4. రవ్వ రంగు మారాక పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేపి మూడు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోండి.
  5. బెల్లంలో మిగిలిన రెండు కప్పుల నీళ్లు పోసి లేత జిగురు పాకం వచ్చేదాకా మరిగించాలి.
  6. మరుగుతున్న లేత పాకంలో మెత్తగా వండుకున్న పప్పు అన్నం వేసి గడ్డలు లేకుండా మెదుపుకోవాలి.
  7. పాకంలో అన్నం కలిసి పోయిన తరువాత మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జాజికాయ పొడి యాలకుల పొడి వేసి మరో 3-4 నిమిషాలు అడుగుపెట్టకుండా మధ్య మధ్యన కలుపుతూ ఉడికించండి.
  8. కలిలోంచి నెయ్యి పైకి తేలుతున్నప్పుడు మిగిలిన కొబ్బరి తురుము అంతా వేసి మరో 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
  9. మిగిలిన నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి పొంగనిచ్చి కలిలో కలిపేసుకోవడమే. ఈ ప్రసాదం వేడిగా చల్లగా ఎలా తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. కానీ నెయ్యి తగ్గితే జిగురుగా ఉంటుంది చేతులకి అంటుకుని.