300
ml చింతపండు పులుసు (70gm చింతపండు నుండి తీసినది)
750
ml నీళ్లు
ఉప్పు
తాలింపు కోసం:
2
tbsp నూనె
4
tbsp వేరుశెనగ గుండ్లు
1/2
tsp ఆవాలు
2
ఎండుమిర్చి
2
కరివేపాకు - రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
విధానం
నానబెట్టుకున్న కందిపప్పులో ఉప్పు పసుపు నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మెత్తగా ఉడికించుకోండి. నచ్చితే పప్పు వడకట్టి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు.
సాంబార్ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేస్తూ మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోండి సన్నని సెగ మీద. ఆఖరున గసగసాలు వేసి చిట్లనిచ్చి దింపి చల్లార్చి మెత్తని పేస్ట్ చేసుకోండి.
బీరకాయని చేదు లేకుండా చూసుకుని కణుపుల దగ్గర చెక్కు తీసిన ముక్కలు 2 కప్పుల నీళ్లలో 80% ఉడికించి దింపేసుకోండి.
సాంబార్ కోసం నూనె వేడి చేసి మెంతులు ఆవాలు ఇంగువ కరివేపాకు ఒక్కోటిగా వేస్తూ వేపుకోవాలి.
వేగిన తాలింపు లో టమాటో ముక్కలు వేసి ఒక నిమిషం వేపుకోండి, తరువాత చింతపండు పులుసు పోసి ఒక పొంగురానివ్వాలి.
పొంగిన పులుసులో సాంబార్ ముద్ద, కందిపప్పు ముద్ద, ఉప్పు, బీరకాయని ఉడికించుకున్న నీరు, నీళ్లు, ఉప్పు, బెల్లం వేసి కలిపి మూతపెట్టి 20 నిమిషాలు మరగనివ్వాలి.
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో వేరుశెనగగుండ్లు, ఆవాలు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి తాలింపుని ఎర్రగా వేపుకోవాలి. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి 20 నిమిషాలుగా మరుగుతున్న సాంబార్లో కలిపేసుకోవాలి.
దింపేముందు ఒక్క సారి ఉప్పు పులుపు రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు పులుపు వేస్తే ఒక పొంగు రానిచ్చి దింపేసుకోండి.