మసాలా కోసం ముందుగా నెయ్యి కరిగించి అందులో మినపప్పు సెనగపప్పు వేసి బాగా ఎర్రగా కలుపుతూ వేపుకోవాలి.
కాస్త రంగు మారుతుండగా మిగిలిన సామానంతా వేసి లో-ఫ్లేం మీద మాత్రమే కలుపుతూ ఎర్రగా మాంచి రంగు సువాసన వచ్చేదాకా వేపుకుని దింపి చలార్చుకుని బెల్లం కూడా వేసి మిక్సీ లో వేసి మెత్తని పొడి చేసుకోండి.
నూనె వేడి చేసి అందులో కరివేపాకు వేసి వేపుకుని, వంకాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ముక్కలని బాగా మగ్గనివ్వండి మీడియం ఫ్లేం మీద.
ముక్కలు మగ్గాక చింతపండు పులుసు, ఉప్పు వేసి ముక్కలు పులుసు పీల్చుకునే దాక మూత పెట్టి మగ్గించుకోండి.
ముక్కులు పులుసు పీల్చుకున్నాక అప్పుడు పొడి వేసి బాగా పట్టించి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
దింపే ముందు 2 tsps నెయ్యి వేసి కలుపుకుని దిమ్పెసుకోండి.