సొయాని నీరు పోసి నానబెట్టి, గట్టిగా నీరు పిండేయండి. కీమా బాల్స్ కోసం ఉంచిన పదార్ధాలని మిక్సర్ జార్లో వేసి అందులో నీరు పిండి సొయా పొడి కూడా వేసి మెత్తగా రుబ్బుకోండి.
మెత్తగా రుబ్బుకున్న సొయా ముద్దలో సెనగపిండి కొత్తిమీర పుదీనా తరుగు వేసి బాగా కలిపి చేతికి నూనె రాసుకుని చిన్న నిమ్మకాయంత ఉండలుగా చేసుకోండి.
మరిగే నూనెలో కీమా ఉండలు వేసి 3-4 నిమిషాలు వదిలేయండి. 3-4 నిమిషాల తరువాత నెమ్మదిగా తిరగేస్తూ ఎర్రగా వేపుకుని తీసుకోండి. అలాగే మిగిలినవి కూడా వేపి తీసుకోండి.
గ్రేవీ కోసం నానబెట్టిన మసాలా దినుసులు అన్ని మిక్సర్ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
నూనె వేడి చేసి ఉల్లిపాయ తర్గుగు కరివేపాకు వేసి ఉల్లిని ఎర్రగా వేపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరొక నిమిషం వేపుకోండి.
ఎర్రబడిన ఉల్లిలో మసాలా ముద్దా ఉప్పు నీరు పోసి కలిపి మధ్యమధ్యలో కలుపుకుంటూ 15-20 నిమిషాలు ఉడికించండి.
15-20 నిమిషాల తరువాత ఎర్రగా వేపుకున్న కీమా ఉండలు వేసి కలిపి ఇంకో 3-4 నిమిషాలు ఉడికించి పైన పుదీనా తరుగు చల్లి దింపేసుకోండి.