మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
నీళ్లలో కాయకూర ముక్కలన్నీ వేసి 70% ఉడికించి తీసుకోండి. ఉడికించిన నీరు పక్కనుంచుకొండి. మీరు తాజా బటాణీ వాడితే ఈ కాయకూరలతో పాటే ఉడికించుకోండి. నేను ఫ్రోజెన్ బటాణీ వాడాను.
నూనె వేడి చేసి అందులో సగం బిర్యానీ ఆకు, సోంపు వేసి చిట్లనివ్వాలి.
తరువాత ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
వేగిన ఉల్లిలో సగం పైన ఉడికించుకున్న కాయకూర ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి.
తరువాత మసాలా పేస్ట్ వేసి 2 నిమిషాలు వేపి కూరగాయలు ఉడికించున్న నీరు, పంచదార వేసి కలిపి మూత పెట్టి మధ్యమధ్యన కలుపుతూ 15 నిమిషాలు ఉడికించుకోండి.
ఆఖరున దింపే ముందు పుదీనా ఆకులు చల్లి దింపేసుకోండి.
కూర చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీరు పోసి పలుచన చేసుకోండి. ఈ వైట్ సాగు పూరి చపాతీతో చాలా రుచిగా ఉంటుంది, అన్నంతో కంటే!!!