గట్టిగా కొబ్బరి ముక్కలా ఉన్న దోసకాయ చెక్కు తీసి లోపలి గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలు తరిగి ఉంచుకోండి.
నూనె వేడి చేసి అందులో వేరుశెనగ గుండ్లు వేసి చిట్లనిచ్చి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లులి వేసి ఎండుమిర్చి పొంగి రంగు మారే దాకా వేపుకొండి.
వేగిన మిర్చి పల్లీల మిక్సర్ జార్లోకి తీసుకుని అందులోనే నానబెట్టిన చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
మెత్తని పేస్ట్ లో పిడికెడు దోసకాయ ముక్కలు వదిలేసి మిగిలిన దోసకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ వేసి రెండు మూడు సార్లు పల్స్ చేస్తూ బరకగా గ్రైండ్ చేసుకోండి.
రుబ్బుకున్న పచ్చడిలో మిగిలిన దోసకాయ ముక్కలు వేసి కలుపుకోండి.
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామాగ్రీ ఒక్కోటి వేసుకుంటూ తాలింపుని ఎర్రగా వేపుకుని పచ్చడి తాలింపులో కలిపి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దింపేసుకోండి.
ఈ పచ్చడి వేడిగా నెయ్యి వేసిన అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.